మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండలం మొండికుంటలో
తెలంగాణ వడ్డెర యువజన సంఘం మరియు
తెలంగాణ వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుని మూడవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిల మల్లు ఆదేశాలమేరకు అశ్వాపురం మండలంలో మండల అధ్యక్షుడు డేరంగుల వెంకన్న ఆధ్వర్యంలో వడ్డెర కుల బంధువుల సమక్షంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం
జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
తదనంతరం అశ్వాపురం మండల అధ్యక్షుడు డేరంగుల వెంకన్న మాట్లాడుతూ
గత రెండు సంవత్సరాల కాలం నుండి వడర్ల సంఘము చేస్తున్న సేవ కార్యక్రమాలు వివరిస్తూ ఇకనుండి వడ్డెర్ల కు
ఏ సమస్య వచ్చినా కూడా
మా వంతు సాయంగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడం కోసం ముందుండి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో శేఖర్, రామ్ ప్రసాద్, కోటేష్ ,వెంకులు, రమేష్, చెంచు నర్సమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: