మన్యంటీవీ ఏటూరునాగారం:
నిలువ నీడ లేని నిరుపేద కుటుంబం వైద్య ఖర్చులు లేక అయోమయంలో ఉన్న నిరుపేద కుటుంబానికి మంత్రి చొరవతో ఇప్పించిన ములుగు చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబ సభ్యులు హర్షం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సలీం పాషా కుటుంబం నీడ లేక కొడుకు ఆరోగ్యం కోసం ఉన్న చిన్నపాటి ఇల్లు ఆస్తులు అమ్ముకున్న నిరుపేద కుటుంబం ఎండి సలీం పాషా తన కుటుంబం కిరాయి ఉంటే వెళ్లి జీవనం సాగిస్తున్నారు వీరి కుమారుడు అస్లాం పాషా కిడ్నీ ఆరోగ్య సమస్య తో బాధపడుతున్నాడు తండ్రి కొడుకు కు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మిగిలిన ఖర్చులు చెల్లించడానికి వారి దగ్గర ఆస్తులు లేవు డబ్బులు లేవు కుటుంబ ఆర్థిక సమస్యలు కుమారుడు ఆరోగ్య సమస్యను మండల అధ్యక్షులు సునీల్ కుమార్ స్థానిక జెడ్ పి టి సి ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగదీష్ దృష్టికి తీసుకువెళ్లగా మానవతా దృక్పథంతో స్పందించి మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొని వెళ్లి లక్ష రూపాయలను తక్షణ సాయం కింద ఎల్ ఓసి ద్వారా మంజూరు చేయించినారు. ఇతర ఖర్చులు భరించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని జడ్పీ చైర్మన్ కృష్ణ జగదీష్ అన్నారు అలాగే మంత్రి సత్యవతి రాథోడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: