మన్యం టీవీ,అశ్వాపురం:మండలం లో రేగుల గండి లో ఘనంగా శ్రీ భవానీ లింగమంతుల స్వామి జాతర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో హాజరైన యాదవులు, భక్తులు. స్వామీ వారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.ఈ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణగోపాలకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ గజ్జల లక్ష్మారెడ్డి, టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ వీరభద్రం, జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షుడు బోబ్బాల నాగేష్, కమిటి నిర్వాహకులు, యాదవ సంఘం అధ్యక్షుడు జనార్దన్, యాదవ సంఘం పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీ లు, అశ్వాపురం, మణుగూరు మండలాల యాదవ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: