మన్యం టీవి పినపాక:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.ఏడూళ్లబయ్యారం హైస్కూల్లో ఉపాధ్యాయులను, పట్టభద్రులైన ఓటర్లను, కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పల్లా రాజేశ్వర్రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న భవిష్యత్తులో చేయబోయే, కార్యరూపం దాల్చే పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు .కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి,ముఖ్య నాయకులు ఉడుముల లక్ష్మిరెడ్డి, ముల్లంగి వెంకటరెడ్డి, బూర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: