మన్యం టీవి పినపాక: జానంపేట లో జరిగే నాగులమ్మ జాతరలో జరిగే ప్రత్యేక పూజల లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలకోసారి ఎంతో వైభవంగా జాతర ను నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త జనార్ధన్ సేవలను కొనియాడారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా , భక్తుల కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా , నిత్యం పూజలందుకునే నాగులమ్మ జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని రేగా కాంతారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహేష్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, వాసు బాబు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, కామేష్ పటేల్, దొడ్డ శ్రీనివాసరెడ్డి, బొలిశెట్టి నరసింహారావు తదితర రాజకీయ ప్రముఖులు, స్థానిక నేతలు పాల్గొన్నారు
Post A Comment: