CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాగులో ఉన్న పోడు భూములు జోలికి రావద్దు: జెడ్పిటిసి కొణకొండ్ల వెంకట్ రెడ్డి..

Share it:

 


  చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:               సాగులో ఉన్న పోడు భూములు జోలికి వస్తే సహించేది లేదని జడ్పిటిసి కొణకొండ్ల వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం పొడు దారులతో  కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఫారెస్ట్ అధికారులు కొందరు దుందుడుకుడు  స్వభావం తో పోడు భూముల్లో ఘర్షణ వాతావరణం కనపడుతున్నాయని అన్నారు.అధికారులు తమ విధులను కచ్చితంగా నిర్వహించాలని,అదే స్థాయిలో పోడు దారులతో సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. పోడు దారులను రెచ్చగొట్టేలా చేయడం సరికాదన్నారు. మహమ్మద్ నగర్ లో సాగు లో ఉన్న రెండు వందల ఎకరాల భూమి రెవిన్యూ భూమి అని,దానిలో ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ సమావేశంలో పోడు సాగుదారులు అజ్గర్, కరీం,  లాల్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: