👉 చింతల చిరంజీవి సేవలు మరువలేనివి
👉దిశ పౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం (మన్యం టీవీ ప్రతినిధి):
భద్రాద్రి జిల్లా మన్యం టీవీ ప్రతినిధి చింతల చిరంజీవి సేవలు మరువలేనివని, ఆయనను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతే మంచి సమాజం ఏర్పడుతుందని దిశ ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. గతంలో చింతల చిరంజీవి ఇద్దరు అనాధ పిల్లలను అక్కున చేర్చుకుని వారిద్దరిని సేవా సంస్థకు అప్పగించడం జరిగిందని ఈరోజు ఇద్దరు మంచి స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. చింతల చిరంజీవి సేవలను స్మరించుకొని ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది.
మహిళా దినోత్సవం సందర్భంగా దిశ పౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం క్లబ్ లో చింతల చిరంజీవి తో పాటు పలువురు పాత్రికేయులను సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐపీఎస్ రోహిత్ రాజ్, సంస్థ ఛైర్మన్ రాజు, షీ టీమ్ అధికారిని
చల్లా అరుణ, ప్రముఖ సామాజిక కార్యకర్త ,పౌండేషన్ కొత్తగూడెం బాధ్యులు మందపల్లి ఉమలు, సీనియర్ రాజకీయ నాయకులు గొల్లపల్లి దయానంద్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి శీలం శ్రీనివాస్ మరియు యు.వి నియర్ పాత్రికేయుడు మిమిక్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: