మన్యం టీవీ మణుగూరు:
ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి శనివారం మణుగూరు, ఆశ్వాపురం,భద్రాచలం,పాల్వంచ,కొత్తగూడెం లోని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్ట భద్రులు మంచి ఆలోచన చేయాలని, తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలన్నారు.తనకు అవకాశం కల్పిస్తే ఎప్పుడు చూడని మార్పు తీసుకు వస్తానన్నారు.విజ్ఞత గల పట్ట భద్రులు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లో ఓటును అమ్ముకోవద్దన్నారు.ఎవరు చేయని విధంగా నిరుద్యోగుల కు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తానన్నారు.తమ సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడుతానన్నారు. మంచి ఆలోచన తో ముందుకు అడుగులు వేస్తున్నానని, తమ అమూల్యమైన ఓటు తనకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, దేవిలాల్,నవీన్,అఖిల్, బాబురావు,బాబీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: