మన్యంటీవీ ఏటూరునాగారం:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ అన్నారు. మండలంల ని రామ్ నగర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి ధనపు నేని కిరణ్ కుమార్, యువ నాయకులు కుమ్మరి చంద్రబాబు, జాడి బోజా రావు, కాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో
ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వసంత శ్రీను ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామంలో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్, ఉపాధ్యక్షులు నాగావత్ కిరణ్, కార్యదర్శి తోట ప్రశాంత్,మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: