మన్యంటీవీ,అశ్వారావుపేట:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడటంతో నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం వామపక్షాల అభ్యర్ధి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ - సిపిఐ(ఎం) శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఇందులో భాగంగా సోమవారం మండల పరిధిలోని సున్నంబట్టి, మామామిళ్ళవారిగూడెం, తిరుములకుంట గిరిజన గ్రామాల్లో గల ప్రభుత్వం పాఠశాల లో ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఓట్లు అభ్యర్ధించారు.
ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల నాయకులు బి.చిరంజీవి, గడ్డం సత్యనారాయణ, సయ్యద్ రఫీ, గన్నమనేని రామక్రిష్ణ లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: