CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డీలర్లకు వ్యవసాయ విద్య

Share it:

 




  మన్యం టీవీ,అశ్వరావుపేట:అశ్వరావుపేట లో రైతు డీలర్లకు వ్యవసాయ విద్యా శిక్షణ ఇవ్వడం జరిగింది. రైతులకు మరింత నాణ్యమైన వ్యవసాయ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం 2003 సంవత్సరంలో ప్రవేశపెట్టిన "దేసి" కార్యక్రమంలో భాగంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శిక్షణ తరగతులు ప్రాంభించారు. జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు అద్వర్యంలో  రైతుకు ప్రధమ మిత్రులైనటువంటి ఎరువులు పురుగు మందుల దుకాణదారులకు వ్యవసాయ విద్య తరగతులు ఏర్పాటు చేశారు. ఒక బ్యాచ్ కి 40 మందికి మాత్రమే విద్యాబోధన చేస్తారు. ఎరువుల డీలర్లు వ్యవసాయ విద్య అభ్యసిస్తే రైతులకు ఉన్నతమైన సేవలు అందుతాయని ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ "మేనేజ్" సగం ఖర్చులు భరిస్తూ ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. పురుగుల మందులు అమ్మాలంటే అగ్రికల్చర్ విద్య అభ్యసించి ఉండాలి అని రూలు వచ్చినపటినుంచి గతంలో ఉన్న డీలర్లు ఈ ఒక సంవత్సరం వ్యవసాయ కోర్సును  చదువుతున్నారు. దీనిలో భూమి లక్షణాలు, పంటలపై వచ్చు పురుగులు, తెగుళ్లు, వాటి నియంత్రణ చర్యలు, ఎప్పుడు పెస్టిసీడ్స్ వినియోగించాలి, సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల ఉపయోగాలు, అధిక రసాయనక ఎరువుల వినియోగం వల్ల నష్టాలు, రైతుకు మేలు చేసే, పర్యావరణానికి కాపాడే వివిధ అంశాల గురించి వ్యవసాయ ఉన్నత అధికారులు అభిమన్యుడు, ఏడిఏ అప్జల్ బేగం, టెక్నికల్ ఏడిఏ లాల్ చంద్, రిటైడ్ అధికారి దామోదర్ రెడ్డి, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్స్, కృషివిజ్ఞాన కేంద్రం సైంటిస్టులు బోధన చేయునున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి అశ్వారావుపేట వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక వ్యవసాయ అధికారి నవీన్, రైతు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: