మన్యం టీవీ, అశ్వాపురం:మార్చి 14 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల లో విద్య వేత్త, టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లా రెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్ పట్ట భద్రులను కోరారు. మొండికుంట గ్రామ పంచాయతీ లో పల్లా కు మద్దతుగా సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్ట భద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ లోని టీ ఆర్ ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని టీ ఆర్ ఎస్ అభ్యర్థి నీ గెలిపించాలని సర్పంచ్, ఎంపీటీసీ కోరారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నాయకులు చావ వినోద్, పట్ట భద్రులు పాల్గొన్నారు.
Post A Comment: