మన్యంటీవి ,పినపాక:
పినపాక మండలంలోని గడ్డం పల్లి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పడిగ శంకరయ్య అనారోగ్యం కారణంగా చనిపోయిన విషయం విదితమే.ఆదివారం నాడు తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు గడ్డంపల్లి లోని శంకరయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ భద్రయ్య, ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: