మన్యం టీవి ,కరకగూడేం:
కరకగూడెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోన విలయతాండవం చేస్తుంది.
ప్రపంచాన్ని సైతం వణికించిన కరోనా ని పట్టించుకోకుండా హాస్టళ్లలో వంట వండే వాళ్ళు కూడా మాస్కులు ధరించడం లేదు. కనీస జాగ్రత్తలు పాటించకుండా, శానిటేషన్ చేయకుండా, హాస్టల్ చుట్టూ పరిశుభ్రత పాటించడం లేదు. హాస్టల్ చుట్టు బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు.తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.విద్యార్థినులను పాఠశాల సిబ్బంది ఇంటికి పంపడం జరిగింది.ఇద్దరు బాలికలకు పాజిటివ్ రావడంతో భయంతో వణికుపోతున్న మిగిలిన విద్యార్థినులు.ఇంకా కొంత మంది విద్యార్థినులు అనారోగ్యం పాలై ఉన్నారు.ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
Post A Comment: