CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరిగిన పెట్రోల్,డీజిల్ రేట్లు తగ్గించాలని ఆటో,కార్ వర్కర్ ధర్నా

Share it:


  మన్యంటీవీ,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని ఏఐటీయూసీ కారు వర్కర్స్, ఆటో వర్కర్స్ వారి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల నెత్తిమీద వేయలేని భారాన్ని మోపినారా అని డీజిల్ పెట్రోల్ ఎన్నడూ లేని విధంగా పెంచాలని ఈ భారం అన్ని వర్గాల ప్రజలపై పడుతుందని, తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని లేనియెడల ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని పెట్టుబడుదారులకు సంపన్నులకు కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ దేశంలో ఏ వర్గ ప్రశాంతంగా లేదని రైతులు చూస్తే 70 రోజులుగా గగ్గోలు పెడుతున్నా గాని కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ ప్రభుత్వం వల్ల ఈ దేశంలో ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు లేవని తక్షిణ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు లు పండూరి వీరబాబుఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు హరి రమేష్ వెంకటేశ్వరరావు రాము తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: