ఉట్నూర్ మన్యం టివి ప్రతినిధి: జైనూర్ మండలం జాం గావ్ లో కోవ లక్ష్మీ జడ్పీ చైర్ పర్సన్ జంగో లింగో దీక్ష స్వీకరించారు. ప్రతి రోజు దీపము ముట్టించి జంగో లింగో గోండి ధర్మ గురును తలుచుకుంటాను అని తెలిపారు. జంగో లింగో వలన ఎం ఎల్ ఏ పదవి వరించింది అని తెలిపారు. అలాగే జడ్పీ చైర్ పర్సన్ కూడా వరించింది. అందరూ కూడా జంగో లింగో దీక్ష తీసుకొని కుటుంబాలు సమాజం మేలు జరుగుతుంది అని సూచించారు. అనేక తరాల నుంచి వస్తుంది మా తాత తల్లిదండ్రుల నుంచి అనుసరించి వస్తున్నాము అని తెలిపారు. జంగావ్ లో ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు. దీక్ష గురు కుంరం భగవంత్ రావు ,ఆత్రం రఘునాథ్ జంగో లింగో ఘన్ సంస్థాన్ అధ్యక్షులు,జైనూర్ ఎంపిపి కుంరం తిరుమల ,కనక యధోరావు గ్రంథ లయ చైర్మన్,పెంధోర్ ప్రభాకర్ న్యాయవాది,ఎంపిటిసి కుంరం భగవంత్ రావు,వైస్ ఎంపిపి జైనూర్,రమాకాంత్ సర్పంచ్ ఊసెగవ్,భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: