మన్యంటీవీ,అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట సిఐ ఉపేంద్రరావు, సోమవారం తన కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....
అవినీతి నిర్మూలన పై యువత ఆలోచించడం ఎంతో అభినందించాల్సిన విషయం అని,అదేవిధంగా అవినీతి లేని వ్యవస్థ వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు. లంచం తీసుకోవడం,ఇవ్వడం నేరమే అని అన్నారు. సమస్య ఎదురైనప్పుడు దానిని ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశంపై యువతలో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాలని, శాంతియుతంగా అవినీతి ప్రక్షాళన కోసం పనిచేయడం గొప్ప విషయం అన్నారు. సమాజంలో మార్పు కోసం యువత ప్రయత్నించాలని అప్పుడే అవినీతిరహిత సమాజం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాక్ (YAC) ఖమ్మం, భద్రాద్రి జిల్లా ఇన్ఛార్జ్ ప్రవీణ్ మరియు వైఏసీ సభ్యులు ముత్యాలరావు, మంగరాజు, దాది చంటి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: