మన్యం టీవీ చర్ల:.
ఈరోజు చర్ల మండలంలోని కలివేరు మరియు చర్ల లో రైతు వేదిక భవనాలను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మరియు ఎమ్మెల్సీ బాలసాని ప్రారంభించడం జరిగింది. బాలసాని మాట్లాడుతూ రైతుల యొక్క సమస్యలు తెలుసుకొనుటకు, వ్యవసాయం లోని నూతన ఆవిష్కరణలు తెలుపుటకు, రైతుల అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావడం కొరకు, రైతే ఒక రాజు గా ఉండాలని ఉద్దేశంతో ఈ రాష్ట్రప్రభుత్వం ప్రతి మండలంలోనూ రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ రైతు వేడుకను చూసుకోవడానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి రైతు వేదిక కు ఉంటారని అన్నారు. రైతుకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా చెప్పారు . ఈ కార్యక్రమంలో పరుచూరి రవి, సర్పంచ్ కాపుల కృష్ణ, జడ్పిటిసి ఇర్పా శాంత, ఎంపీపీ కోదండ రామయ్య, ఉప సర్పంచ్ శివ, ఏ ఈ ఓ మౌనిక , రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: