CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు వైద్య పరీక్షలు...

Share it:



మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం  పడమట నర్సాపురం లోని "ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో" మంగళవారం జూలూరుపాడు స్థానిక వైద్యాధికారి డాక్టర్ వీరబాబు ఆధ్వర్యంలో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంత మంది బాలికలకు జలుబు, దగ్గు, లక్షణాలను గుర్తించిన వైద్యులు వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేసిన అందరికీ నెగిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతరం కొంత మంది బాలికలకు రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ.. చదువుతోపాటు పరిశుభ్రత, ఆరోగ్యం, పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల, గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం ఆదిలక్ష్మి, హెచ్ఎస్ జానకి రామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: