మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని గుండెపుడి గ్రామ పంచాయతీని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎల్పీవో హరిప్రసాద్, ఆకస్మికంగా సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, తో పాటు గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థిని, విద్యార్థుల, సౌకర్యాలు, కోవిడ్, నిబంధనల అమలు, పట్ల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం పట్ల నిరంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంట గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ నరసింహారావు, ఎంపీడీవో రామారావు, ఉన్నారు.
Post A Comment: