నూగూరు వెంకటాపురం
వెంకటాపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు చెరుకుల సర్వేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టానికి విరుద్ధంగా 1970 తర్వాత గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న బహుళ అంతస్తులు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చట్టాలను మరిచిపోయి నట్లుగా వ్యవహరిస్తున్నారు. 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి తెగల అన్యాక్రాంతం అడ్డుకునే అధికారం ఉంటుంది 1/70( డి )ప్రకారం అక్రమ వ్యాపార దుకాణాలు మరియు ఇతర కట్టడాలను నిరోధించే అధికారం ఉన్నప్పటికీ అధికారులు లు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ ఎటువంటి మార్పు లేదు నందున జిల్లా అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. అక్రమ బహుళ అంతస్తులు నిర్మించిన గిరిజనేతరుల పై ఎల్ పి ఆర్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పులిశె నరసింహారావు మండల అధ్యక్షుడు చెరుకుల సర్వేష్ , తుర్స చంటి ,కంతి రాజారావు తుర్స కృష్ణ బాబు, కుర్సం నాగయ్య ధర్మరాజు పాల్గొన్నారు
Post A Comment: