మన్యంటీవీ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లో 30 గ్రామపంచాయతీల వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చెయ్యడం జరిగింది. ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గా ఏఐటియుసి జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు కనీస వేతన చట్టం 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకొచ్చిన 20, 26 జీవోను రద్దు చేయాలని ప్రతి కార్మికులకు సీ.పి.ఆర్లిస్టులో పేరు నమోదు చేయాలని ప్రతి గ్రామపంచాయతీ నుండి కార్మికులకు తీర్మానం కాపీ ఇవ్వాలని, ప్రతి కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులను ఉపయోగించే చర్యలు తీసుకోవాలని, ప్రతి కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు, కార్యదర్శి పేరుమల రాంబాబు, చిన్న, నాగేశ్వరరావు, బసవయ్య, నరసమ్మ, సహదేవుడు, అన్నవరం, జేమ్స్, రాములు, ధర్మారావు మరియు ముప్పై ఒక్క గ్రామపంచాయతీల వర్కర్స్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: