నూగూరు వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని ప్రముఖ మెడికల్ షాప్ యజమాని శ్రీమతి ఇప్పల దుర్గా కల్యాణి వారి కుమార్తె ఇప్పాల జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్నేహితురాళ్ళుతో కలసి ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రేస్ హోమ్ అనాధ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వృద్ధులకు పాయసం స్వీట్లు పండ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు కారం రాధా గమాట్లాడుతూ ఈ పేద వృద్ధాశ్రమాన్ని గుర్తుంచుకొని ఈ మా ముద్దుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు అని తెలియజేశారు.కాగా ఈ విధంగా మా ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఇది మూడవసారి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి (పోస్ట్ మాస్టర్) గ్రామీణ వైద్యులు దామినేని రాజేంద్ర ప్రసాద్, బొగ్గుల పుష్ప, కారం రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: