మన్యం టీవీ మణుగూరు:
ఓరియంటల్ స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వారు జనవరి 30,31 తేదీలలో నిర్వహించిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ మణుగూరు సి టైప్ ఎక్స్లెంట్ ఉన్నత పాఠశాలకు చెందిన యామిని,పల్లవి లు తమ ప్రతిభను చాటారు.6వ తరగతికి చెందిన జె. యామిని జాతీయస్థాయిలో కటా విభాగంలో ప్రథమ స్థానాన్ని మరియు కుమితే విభాగంలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 5వ తరగతికి చెందిన రాయల.పల్లవి కటా విభాగంలో తృతీయ బహుమతి కైవసం చేసుకుంది.ఈ సందర్భంగా సోమవారం పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో వారిని సన్మానించి, ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఖాదర్, యూసఫ్ షరీఫ్,యాకుబ్ షరీఫ్,జినత్,నయ్యర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: