అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర!
అచ్చంపేట:
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్కు ఆయన పాదయాత్రగా బయల్దేరారు. పాదయాత్ర చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క రేవంత్ను కోరారు. దీంతో అప్పటికప్పుడు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ రూ.15లక్షల కోట్లను కార్పొరేట్లకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగుచట్టాల్లో కొనుగోలు కేంద్రాలే లేవన్నారు. చట్టాల్లో మార్కెట్ యార్డులు, మద్దతు ధర లేవని చెప్పారు. రైతుల జీవితాలను అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ సమర్థిస్తున్నారని ఆయన విమర్శించారు.
Post A Comment: