మన్యం టివి,దమ్మపేట : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చిన్న పిల్లలు చదువుకునే చందమామ కథల ఉందని
సీపీఐ నేత నరాటి ప్రసాద్ విమర్శించారు. బీజేపీ దేశాన్ని ఓఎల్ఎక్స్, అమెజాన్ లో పెట్టి అమ్మేసెలా ఉంది అని దేశ చరిత్రలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పోరేట్ కంపెనీలకు దాసోహం చేసి అమ్మకానికి పెట్టినట్టు ఉంది అన్నారు. నరేంద్ర మోడీ బడ్జెట్ పై చేసిన ప్రకట భారతదేశాన్ని దివాలా తీసే లాగా ఉంది అన్నారు,ఈ ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కింది అని విమర్శించారు.ఈ రోజు నల్లముడి గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేదలకు ఇస్తున్న ఎరువులు, పురుగుమందులు,పెట్రల్ డీజల్ ,గ్యాస్ పై సబ్సిడీలు ఎత్తి వేయటం వలన దేశ వ్యాప్తంగా రైతులు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది అని,గత 70 ఏళ్ల గా ప్రజలు పన్నులు ద్వారా కేంద్ర ప్రభుత్వం కు ఇచ్చిన సొమ్ము తో నిర్మితమైన రైల్,విమాన, బ్యాంక్,చమురు,ఇన్సూరెన్స్, ఇస్రో,ఉక్కు పరిశ్రమ,బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం రంగంలో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న,కంపిణీలను ప్రేవేట్ పరం చేయుటకు ఈ బడ్జెట్ లో దారులు తీసి దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.కేవలం అంబానీ అదాని ల కోసం దేశాన్ని మొత్తం వాళ్ళ కాళ్ళ ముందు పడేస్తుందని అని,బీజేపీ దేశాన్ని కి పట్టిన శని గ్రహం అని బీజేపీ పీడను ప్రజలు వదిలించు కోవాలని కొరినారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎంపీటీసీ జాబ్బర్, బొడ్డు కృష్ణ,లాకావత్ బాలకృష్ణ,వాడే నగేష్,బుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: