మన్యం టీవీ,దమ్మపేట:
ఈరోజు భద్రాద్రి జిల్లా,దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం వార్షికోత్సవం అశేష భక్తుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది.మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి ఆశీస్సులు పొందారు.పెద్దలు గారపాటి అనురాధసూర్యం గారి దంపతులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయ్యం ప్రసాద్, ఎల్ ఎస్ సి ఎస్ చైర్మన్ జోగుబాబు,ఆత్మ కమిటీ ఛైర్మన్ కె.వి,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్,మండల నాయకులు పోతినేని వెంకట్రావు,కూకలకుంట రవి, నల్లగుళ్ల సత్యనారాయణ,యార్లగడ్డ బాబు,పానుగంటి రాంబాబు,యూత్ నాయకులు కూకలకుంట కిషోర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: