CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కనిగిరి గుట్టల్లో చిరుత సంచారం. సీసీ కెమెరాకు చిక్కిన చిరుతపులి.

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ  ప్రతినిధి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతం కనిగిరి గుట్టల్లో. చిరుత పులి సంచరిస్తున్నట్లు దాని ఆనవాళ్లు  ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కింది.  ఇదే విషయాన్ని ఫారెస్ట్ అధికారులు కూడా ధృవీకరించారు. వివరాల్లోకి వెళితే. తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చండ్రుగొండ, కల్లూరు, ఏన్కూరు,  జూలూరుపాడు, మండలాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉండటం దీనికి తోడు ఫారెస్ట్ అధికారులు సైతం జీవరాశులను కాపాడుకునే లక్ష్యంతో అడవి ప్రాంతాల్లో చెరువులు కుంటలు తవ్వించి ఎప్పుడు మంచినీరు ఉండేలా చర్యలు తీసుకున్నారు దీంతో అటవీ ప్రాంతంలో ఎండాకాలం సైతం పచ్చిమేత ఉండేటట్లు ఏర్పాటు చేసారు. అడవి జంతువులను వేటగాళ్లు వేటాడ కుండా ఎక్కడికి ఎక్కడ అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో అడవిదున్నలు, జింకలు, దుప్పులు అడవి పందులు, కుందేళ్ళు, వందల రకాల పక్షులు నిత్యం సంచరిస్తూ  సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. అందులో భాగంగా చిరుత పులి కూడా సిసి కెమెరా కు చిక్కింది ఇదే విషయాన్ని  తల్లాడ రేంజ్ ఫారెస్ట్ అధికారి. అరవింద్ ను వివరణ కోరగా అతను మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో చిరుత పులి సంచరిస్తు ఉండేదని. గత కొద్ది రోజులుగా దాని ఆచూకీ కనపడలేదని. మళ్లీ కనిగిరి గుట్టల్లో  పులి సంచారం కనిపించిందని తెలిపారు. అలాగే అడవికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా. పశువులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి  తీసుకుని వెళ్ళకుండా మైదాన ప్రాంతాల్లోనే పశువులని మేతకు తీసుకువెళ్లాలని సూచించారు. అడవిలోని జంతువులకు ఎవరు హాని చేయరాదని అన్నారు. ఎవరికైన కొత్త జంతువులు కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.  ఫారెస్ట్ అధికారులు చేస్తున్న కృషికి జీవరాశులు అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో   ఉన్నతస్థాయి ఫారెస్ట్ అధికారులు సైతం చండ్రుగొండ, తల్లాడ, రామవరం, రేంజ్ ఫారెస్ట్ అధికారులను అభినందిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: