CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూగు మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుడు ఆత్మహత్య యత్నం

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు మున్సిపాలిటీ లో అధికారులు రెండు సంవత్సరాలుగా పనిచేపించుకొని జీతం ఇవ్వకుండా కమిషనర్ తో పాటు మరికొందరు అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కుమారస్వామి అనే కాంట్రాక్టు కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు.ఈ విషయం పై మున్సిపాలిటీ అధికారుల ను వివరాలు అడుగగా కుమారస్వామి,మున్సిపాలిటీ లో ప్రైవేటు కార్మికులు గా పని చేస్తున్నారు అని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ప్రైవేటు కార్మికులకు రూ.6000 జీతం ఇస్తున్నాము అని, కుమారస్వామి కూడా మూడు నెలల జీతం తీసుకున్నారూ అని అన్నారు.కుమారస్వామి తో పనిచేసే కార్మికులు అందరూ పని చేసుకుని జీతం తీసుకుంటున్నారు అని అన్నారు.కుమారస్వామి తనకు పర్మినెంట్ ఉద్యోగుల లాగా 12000 జీతం ఇవ్వాలని తనను పర్మనెంట్ చెయాలి అని కోరారు అని తెలిపారు.ప్రభుత్వం నుంచి తమకు అటువంటి ఆదేశాలు,అధికారాలు ఏమి జారీచేయలేదు అని,అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కుమారస్వామి ని పర్మినెంట్ గా తీసుకుంటాం అని తెలిపినప్పటికి తాను పనులకు రాకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు అని వారు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: