మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయతీ లో ముస్లీం మైనారిటీలు,పేద పిల్లలకు, చెందిన,మదర్శా ఉర్దూ స్కూల్కు కమిటీ సభ్యులు, ఎండి మజీద్,ఎండి.ఖాదర్, ఎండి. అనీఫ్,ఎండి. యాకూబ్,షరీఫ్,ఎస్క్. ఆజం,తదితరులు వర్షాకాలంలో పిల్లలు నడవటానికి ఇబ్బంది పడుతున్నారు అని స్థానిక సర్పంచ్ కు తెలియజేయగా, పిల్లల ఇబ్బందిని గుర్తించి తక్షణమే స్పందించిన సర్పంచ్ ఏనిక ప్రసాద్, పంచాయితీ నిధుల నుండి రూ.2 లక్షల రూపాయలతో మంగళవారం సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల జడ్పీటీసీ పొశం నరసింహారావు,భద్రాద్రి జిల్లా ఎంపీటీసీల సంఘం,ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీ మచ్చ సమ్మక్క,ఉప సర్పంచ్ ఎస్కె బాజీ,వార్డ్ సభ్యులు, కలగూర శంకర్,పోదెం రమాదేవి,ఎం.కిరణ్ కుమార్,తాళ్లూరి జ్యోతి, ఎస్కె షాకీరా బేగం, బర్ల స్వేతన్,మేకల మాదవి, నాయకులు ఆర్.వెంకట రెడ్డి,ఎండి పారుక్,ఎస్కె. కరిముల్లా,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: