మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సమితిసింగారం పంచాయతీ పరిధిలోని పాత పోలీస్ కాలనీ లో నిన్న సోమవారం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మంగళవారం ఉదయం మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం పనులు ప్రారంభించిన జడ్పీటీసీ పోశం నరసింహరావు, ఎంపీపీ కారం. విజయకుమారి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై టిఆర్ఎస్ పార్టీ మరియు ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్నాము అని వెంటనే స్పందింస్తాము అనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, కో అప్షన్ జావిద్ పాషా, సర్పంచ్ బచ్చల భారతి, ఉపసర్పంచ్ పుచ్చకాయల. శంకర్,4వ వార్డు మెంబెర్ వీరపనేని చెన్నకేశవులు,2వ వార్డు మెంబర్ బర్మావత్ నర్సింహారావు,టిఆర్ఎస్ నాయకులు రామిరెడ్డి,మేకల రవి,గాజుల నరేష్,తంత్రపల్లి కృష్ణ,నాయుడు,కర్ల.వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: