CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కన్నాయిగూడెం మండలాన్ని దత్త తీసుకుంటా

Share it:

 


*ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్.


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాలు,

మండలాల  విభజనలో భాగంగా కన్నాయిగూడెంని  కొత్త మండలంగా ఏర్పాటు  చేయడం జరిగింది.  ఈ కొత్త మండలం కన్నాయిగూడెం

అభివృద్ధి చేసే బాధ్యత నాది.

దత్త తీసుకొని అభివృద్ధి చేస్తాను.

కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు

ఏర్పాటు చేసి పల్లెల్లో అభివృద్ధి లక్ష్యం గా ముందుకు వెళుతున్నారు. 

దేవాదుల నీటితో కన్నాయిగూడెం మండల రైతులకు

సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని

హామీ ఇచ్చారు. 

ఈయొక్క కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,జిల్లా కోప్షన్ వాలియాబీ, మైనార్టీ జిల్లా నాయకులు తహిర్ పాషా,చిన్నికృష్ణ,ఏటూరునాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్, ఎంపీటీసీలు, వివిధ గ్రామ పంచాయితీ సర్పంచులు వార్డ్ నెంబర్లు కుమార్, టిఆర్ఎస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: