మన్యం టీవీ, పినపాక:భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పినపాక మండలం గోపాల రావు పేట గ్రామంలో స్వతంత్ర సమరయోధులు బొలిశెట్టి నరసింహయ్య కుటుంబాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.తొలుత బోలిశెట్టి నరసింహయ్య చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం బోలిశెట్టి కుటుంబ సభ్యులు బోలిశెట్టి విజయ ఆనంద్ భాస్కర్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ... బోలిశెట్టి దేశానికి చేసిన సేవలు మరువలేని అని అన్నారు. బోలిశెట్టి మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటన్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు అక్కిరెడ్డి సంజీవ రెడ్డి,బోలిశెట్టి నరసింహారావు, తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: