మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండల అధ్యక్షుడు రాంగాని అనిల్ అధ్యక్షతన శాంతి యుత నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు మాట్లాడుతూ రామ మందిరా నిర్మాణానికి అనిచిత వాక్యాలు చేసినా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని అనుచిత వ్యాఖ్యలకు గాను యావత్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.దీనిని బట్టి హిందువుల పట్ల తెరాస ప్రభుత్వ మొండి వైఖరి ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని నోరు అదుపులో ఉంచుకోవాలని తెరాస ప్రభుత్వ వైఖరి మరకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం కార్యదర్శి బొంబోతుల మురళి, జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు ఎజ్యాస్ ఖాన్,జిల్లా కార్యవర్గ సభ్యులు గంధం రవీందర్ మండల నాయకులు తాటి సునీల్,ఈక సురేష్,వడ్లకొండ కార్తీక్,గోగు రాజశేఖర్,గంగపురo చంద్రమౌళి,కొత్నాల కుమార్,సంజయ్,ఎదురుగట్ల సంతోష్,బీజేపీ సీనియర్ నాయకులు దంతానపల్లి పురుషోత్తం,గుండు నాగయ్య గుండు ప్రసాద్,దామ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: