*తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు
* రాపట్ల గొత్తికొయ గూడెంలో కార్డెన్ సర్చ్
మన్యంటీవీ తాడ్వాయి/ఏటూరునాగారం:
సంఘవిద్రోహ శక్తుల కు, వివిధ నిషేధిత విప్లవ పార్టీ గ్రూపులకు సహకరించవద్దని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలోని లింగాల గ్రామ పంచాయతీ పరిధిలో గల రాపట్ల గుత్తి కోయ గూడెం లో తాడ్వాయి ఎస్సై సి హెచ్ వెంకటేశ్వరరావు తన పోలీసు బలగాలతో కలసి ఉదయాన్నే కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే కోణంలో సోదాలు చేశారు.అనంతరం గొత్తికోయ ఆదివాసీలందరిని ఒక్కటే వద్ద సమావేశపర్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘీక శక్తులకు ఆశ్రయం కలిగించదని తెలిపారు. ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్లో తెలియజేసి సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల కు తావిచ్చిన, చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు కనబడితే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. వారి యొక్క జీవన పరిస్థితులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొతికొయ గిరిజనులు పిల్లలకు మంచి చదువులు చదివించాలని సూచించారు. మంచి పౌరులుగా ఉండాలని తెలిపారు. ఈ ఆపరేషన్ కార్యక్రమంలో తాడ్వాయి స్టేషన్ సిబ్బంది మరియు సివిల్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నారు.
Post A Comment: