తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పదోన్నతుల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్న శీలం ఇందిర తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర నందు నియమించబడి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, కళాశాల ప్రిన్సిపల్ ఏ. ఎల్ .ఎన్ శాస్త్రి ,సహ ఆచార్యులు కావూరి రవికుమార్, కమలాదేవి , కార్యాలయ సిబ్బంది సి.హెచ్ రవి కుమార్, పుణ్యవతి లు ఇందిరకు శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: