మన్యం టీవీ కొత్తగూడెం, ఫిబ్రవరి 2: భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న మహిళా మెకానిక్ గా గుర్తింపు పొందిన ఆదివాసి వనిత ఎదళ్లలపల్లి ఆదిలక్ష్మి వనిత గ్యారేజ్ ను మంగళవారం ఆదివాసి ఐకాస ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ బృందం మెకానిక్ పనితీరును, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఆదివాసి మహిళ మెకానిక్ పనితీరును వివిధ టీవీ ఛానల్,సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కవితక్క ఇచ్చిన హామీ 16 లక్షల రూపాయలతో నూతన గ్యారేజ్, ఎక్విప్ మెంట్ ను ఇవ్వడాన్ని అభినందిస్తూ ఆ కుటుంబానికి ఆదివాసి ఐకాస నుండి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో 125 గజాల ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇస్తామని ఐకాస ప్రతినిధి బృందం హామీ ఇస్తున్నట్లు పేర్కొంటూ ఆదివాసి మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, వారికి ఆదివాసీలందరు అండగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, జిల్లా నాయకులు(చలనచిత్ర నటుడు) పూనం శ్రీనివాస్,
వాసం అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: