మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో మిధున స్టేడియం దగ్గర గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి ఇక్కడ పర్మిషన్ లేకుండా టెంటు వేసి రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం పట్టణ ఎస్సై వెంకటేశ్వరరావు హుటాహుటిన వచ్చి అక్కడ రిలే నిరాహార దీక్షలు చేసే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో బూసి రెడ్డి శంకర్ రెడ్డి ఇద్దరు పూజారులు వారు అనుచరులు మరియు తదితరులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు చేసిన తర్వాత తమ సిబ్బందికి చెప్పి టెంటు దగ్గరుండి తొలగించమని ఎస్సై వెంకటేశ్వరరావు చెప్పడం జరిగింది.
Post A Comment: