CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ రహదారి దిగ్బంధం

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం జాతీయ రహదారిపై బైఠాయించి న సిపిఎం ,సిపిఐ ,సిపిఐ న్యూ డెమోక్రసీ మరియు కాంగ్రెస్ నేతలు రైతులకు 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్య నేతల ధర్నా చేయడం జరిగింది. సిపిఎం ముఖ్యనేత ఏజే రమేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేత కాని ప్రభుత్వం అని మండిపడ్డారు రైతులకు తీవ్ర నష్టం చేసే పథకాలను అమలు చేయకూడదని ఆయన మండిపడ్డారు అక్కడ ఢిల్లీలో సుమారుగా చాలా మంది రైతులు వీరోచితమైన పోరాటం చేస్తున్నారని వివరించారు, కావున అక్కడ ఢిల్లీలో సుమారు 170 మంది రైతులు చనిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రైతే దేశానికి వెన్నుముక అని రైతే రాజు గారి చూద్దామనుకుంటే కొత్త కొత్త పథకాలు పెట్టి రైతు ఇంకాస్త వెనక్కు నెట్టి విధంగా ఉన్న పథకాలు అమలు చేయకూడదని మీ దీక్ష చేపడుతున్నామని అన్నారు. ఆయనతో పాటు మిగతా ముఖ్య నేతలు కూడా మాట్లాడి డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ అనే స్లోగన్ తో దీక్షను దద్దరిల్లే విధంగా దీక్షలో పాల్గొన్నారు. దీక్ష భద్రాచలం జాతీయ బ్రిడ్జి మీద జరగడం వల్ల సుమారు రెండు గంటల సేపు వాహనాలు నిలిచిపోవడంతో  ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు భద్రాచలం ఒకటే మార్గం అవటం వలన ట్రాఫిక్ జామ్ మరింత అంతరాయం కలిగించింది. సుమారు రెండు గంటల తరువాత వాహనాలు కదిలాయి. ఈ దీక్షలో పాల్గొన్న ముఖ్యనేతలు సిపిఎం పార్టీ నుంచి ఏజే రమేష్, జీ సాయి, ఎం బీ నర్సారెడ్డి, బి వెంకట రెడ్డి, ఎం రేణుక, డి లక్ష్మి, ఎస్ గంగా, సాయి, కల్పన మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: