మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ సీపీఐ కార్యాలయంలో బుధవారం సమితి సింగారం పాత పంచాయతీ పరిధిలోని గ్రామాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య పాల్గొని, మాట్లాడారు.ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ పేదల పార్టీ అని,అధికారం ఉన్న లేకున్నా నిరంతరం పేద ప్రజలకు,కార్మికులకు,కర్షకులకు,బడుగు బలహీన వర్గాలకోసం నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందని అన్నారు.అధికారంతో పని లేదని పోరాడి హక్కులు సాధించుకునే పార్టీ సీపీఐ అని ప్రతి కార్యకర్త ఎల్లవేళలా అండగా ఉండాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ కార్యకర్త కృషిచేయాలని అప్పుడే పార్టీ బలపడుతుందన్నారు. అంతేకాకుండా అందరం సైనికునిల శ్రమించాలన్నారు ఈ ప్రాంత అభివృద్ధిలో సీపీఐ పార్టీ పాత్ర మారువలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సైరెడ్డి పుల్లారెడ్డి,జిల్లా సమితి సభ్యులు రావులపల్లి రామ్మూర్తి,అక్కి నరసింహారావు,మండల పట్టణ కార్యదర్శిలు యస్.కె సర్వర్,దూర్గ్యల సుధాకర్, సర్పంచ్ బడిష సతీష్,మంగి వీరయ్య,విరస్వామి,వజ్జా వెంకటేశ్వర్లు,రాజమోగిలి,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: