మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో ఐ టి డి ఎ పి ఓ గౌతమ్ పోట్రు ఒక ప్రకటనలో తెలిపారు, అది ఏమనగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అర్హులైన గిరిజన అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఆన్ ఆన్ లైన్ లో లో ఈ నెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఆరు కేంద్రాలలో 900మందికి 60 రోజులు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు భోజన వసతి, మెటీరియల్, పాకెట్ మనీ కూడా అందజేయనున్నట్లు వివరించారు. పోలీస్ శిక్షణ పొందే వారికి ట్రాక్ సూట్, షూస్ ఇస్తామని తెలిపారు. కావున అర్హులైన గిరిజనులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్ 040-27540104 సంప్రదించగలరు.
Post A Comment: