*ములుగు-భూపాలపల్లి జిల్లాల రైతు బంధుసమితి కో-ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య.
*రైతులకు శిక్షణ తరగతులు ప్రారంభం.
మన్యంటీవీ గోవిందరావుపేట/ఏటూరునాగారం:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ , రైతుబంధు సమితి ఛైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం ములుగు-భూపాలపల్లి జిల్లాల రైతుబంధుసమితి కో-ఆర్దినేటర్ పల్లా బుచ్చయ్య చల్వాయి క్లస్టర్ రైతులకు శిక్షణ తరగతులను గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామంలో యంపిపి సూడి శ్రీనివాస్ రెఢ్ఢితో కలిసి నూతనంగ నిర్మించిన, రైతు వేదికలో శిక్షణ తరగతులను ప్రారంబించారు. అనంతరం పల్లా బుచ్చయ్య మాట్లాడుతు రాష్ట్రంలో వ్యవసాయం భారంగ మారిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తన అధ్బుతమైన పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశ పెట్టి వ్యవసాయరంగాన్ని ఒక పండుగల మార్చారు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కోంటున పలు సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ధృష్టిలో పెట్టుకోని రైతులకు రైతు బంధు సాహాయం అందిస్తున్నారని అన్నారు.అంతే కాక వ్యవసారంగంలో నాణ్యమైన విత్తనాలను అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ధ్వారా రైతులకు అందిస్తున్నారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విధ్యుత్ అందిస్తు,లాభసాటి వ్యవసాయం ద్వారానే రైతులు అభివృధ్ధి చెందుతారని గుర్తించిన ముఖ్యమంత్రి పరిస్థితి, ప్రాంతాన్ని బట్టి వ్వవసాయ వంగడాలను అమలు చేశారని పల్లా బుచ్చయ్య గుర్తుచేశారు. రైతులు ధళారి వ్యవస్తలో ఇభ్భందులు పడుతున్న సందర్భంలో ఆ వ్యవస్తనే పూర్తిగా రూపు మాపి వ్యవసాయ పాలక మండలలా ధ్వారా,ఐకెపి,వివిధ సంఘలా ధ్వారా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే స్వయంగ కొనుగోలు చేసి వారు డబ్బులను వారంరోజుల వ్యవదిలోనే నేరుగ రైతుల బ్యాంకు ఖాతాలో వేసిన ఏకైక ప్రభుత్వం భారత దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. రాబోవు రోజులలో వ్యవసాయం ఒక విప్లవాత్మకమైన మార్పుతో తెలంగాణ వర్ధిల్లుతుందని అన్నారు.అదేవిధంగా గ్రామాలలో రైతులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేసి రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని,వ్యవసాయ అధికారులకు, గ్రామ కో ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్,మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి ,గోపాలరెడ్డి, మండల కో ఆర్డినేటర్ మధుసూధన్ రెడ్డి, దేవానాయక్ గ్రామ కోఆర్డినేటర్లు,రైతులు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: