*తుడుం దెబ్బ బిజెపి ఆధ్వర్యంలో ర్యాలీ.
మన్యంటీవీఏటూరునాగారం:
కన్నాయిగూడెం మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. తదనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం హన్మకొండ లో జరిగిన అగ్రకులాల సమావేశం లో దళిత బహుజన కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అలాగే తుడుం దెబ్బ కు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ ఈ ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ మాట్లాడిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కావేరి సంతోష్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.గిరిజన మోర్ఛా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ,మహిళ మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి ఉషాకిరణ్ లు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో వెనకబడిన తరగతులు,దళితులు,గిరిజన,మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన చల్లా ధర్మారెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి,ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.ధర్మారెడ్డి పై చర్యలు తీసుకొని యడల భారతీయ జనతా పార్టీ దశల వారీగా అన్ని వర్గాలతో నిరసనలు,ర్యాలీలు,రాస్తారోకోలు ఉధృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గుండ్ల పాపారావు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు జబ్బా సమ్మయ్య, మైనారిటీ మోర్ఛా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్ పాషా,దళిత మోర్ఛా జిల్లా అధ్యక్షుడు కావేరి అర్జున్,దళిత మోర్ఛా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,మైనార్టీ మోర్ఛా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా,మహిళా మోర్ఛా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక మహాలక్ష్మి,ఏటూరునాగారం,తాడ్వాయి బిజెపి మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం,మల్లెల రాంబాబు,మహిళా మోర్ఛా మండల ప్రధాన కార్యదర్శి పలక గంగ,సీనియర్ నాయకులు,బూత్ కమిటీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: