మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని
కొత్తూరు మొట్లాగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మాయి గూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులు ఈరోజు కోమటిపల్లి క్రాస్ లో ఎం ఎల్ ఏ సీతక్క ను కలిసి ,
గత ఇరవై సంవత్సరాలనుండి గా పోడు భూములను సాగు చేసుకుంటున్నామని ,
గత రెండు నెలలు గా మీ భూముల్లో మొక్కలు పెడతామని అటవీశాఖ అధికారులు బయ భ్రాంతులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారని కావున ఫారెస్ట్ అధికారులు మొక్కలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు మంకిడి మహేందర్, వట్టం పుల్లయ్య, ఈసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: