మాల మహా నాడు ములుగు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు డిమాండ్
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలకేంద్రం లో ములుగుజిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి దళితులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు దళితప్రజలను మానసిక క్షోభకు గురిచేశాయని, ధర్మారెడ్డి సాక్షాత్తు భూస్వామి లాగా మాట్లాడిన తీరు చూస్తుంటే ఇతను ప్రజా ప్రతినిధి కాదేమోఅనిపిస్తుంది, లేదా మతి తప్పి మాట్లాడినట్లు వుంది. ప్రజాస్వామ్యంలో ఉండి ఒక ఉన్నత స్థానం లో ఉండి కూడా ధర్మారెడ్డి ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడినతీరు చూస్తుంటే మనసులో ఉన్న భావాలను బయట పెట్టాడేమో అనిపించింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి వెంటనే దళిత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని నీ వర్గానికి పంతపాడు అంతే కానీ మా దళిత బిడ్డల జోలికి వస్తే పుట్ట గతులుఉండవు. మా దళితులు ఓట్లు వేయనిదే గెలిచావా? అంత నమ్మకం నీ మీద, నీ వర్గం మీద ఉంటే రాజీనామా చేసి గెలిచి చూపించు అప్పుడు తెలుస్తుంది నీకు నీ సత్తా ఏంటో, మా సత్తా ఏంటో. మరొక్క సారి మాట జారితే చాలా తీవ్ర పరిణామాలు చవి చూడవలసిఉంటుంది. ధర్మ రెడ్డి చవకబారుమాటల వల్ల దళిత ప్రజలు తెరాస ను అపార్ధం చేసుకుంటున్నారు అందువల్ల వెంటనే ఎమ్మెల్యే ధర్మారెడ్డి మీద క్రమశిక్షణచర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post A Comment: