CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి సిఐటియు చర్ల

Share it:

 


 మన్యం టీవీ చర్ల :

చర్ల మండల కేంద్రంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు చర్ల మండల పరిషత్ కార్యాలయం ముందు వారి సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సి ఐ టి యు మండల నాయకుడు కొండా.చరణ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను  ప్రభుత్వం బానిసలుగా పరిగణిస్తుందని, గ్రామపంచాయతీ పరిధిలో కాలిగా ఉన్న పోస్ట్లు భర్తీ చెయ్యకుండా ఉన్న సిబంది పై విపరీతంగా పనిభారం పెంచడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని అన్నాడు. 8 గంటల పనివిధానం అమలు చేయాలని, దిక్కుమాలిన మల్టిపర్పస్ విధానం రద్దు చెయ్యాలని, ఖచ్చితంగా ఆదివారం మరియు పండుగల రోజున సెలవు దినాలని మంజురి చెయ్యాలని, మెమో నంబర్ 2026 ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. కార్మికులపై పెరుగుతున్న అధికారుల ప్రజాప్రతినిధులు చేస్తున్న వేధింపులు ఆపాలని, కార్మికుల అక్రమ తొలగింపులు నిలిపివేయాలని అన్నాడు.2లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలి. మరుగుదొడ్లు కడిగించాలని చూస్తున్న పద్ధతి మానుకోవాలి. జీఓ నంబర్ 51 ని సవరించాలని డిమాండ్ చేశారు.. అనంతరం ఈవో ఆర్ డి నారాయణ గారికి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు కళ్యాణ్,సతీష్,నెలనర్సింహారావు, రవణయ్య, ప్రేమ్,ఆనంద్,కుమార్ నాని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: