రాష్ట్ర పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
కరకగూడెం మండలంలోని పెరిక కులస్తులు అన్ని రంగాల్లో ముందుండాలని,పెరిక ఐక్యతకు చాటుకోవాలని మండల పెరిక సంఘం పెద్దలు చిట్టి వెంకటేశ్వర్లు,బైరిశెట్టి చిరంజీవి,అత్తె నాగేశ్వరరావు,అత్తె సత్యనారాయణ,వెంకన్న పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రంలో మండల పెరిక సంఘం ముఖ్యనాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర పెరిక కుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ...పెరిక కులస్థులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని.. సంఘం విద్య,వైద్యం, ఉద్యోగం,క్రీడా,రాజకీయ రంగాల్లో రణించి,పేరు తీసుక రావాలని అన్నారు.పెరిక కులస్థులం ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఫిబ్రవరి 14వ తేదీన రాళ్ళవాగు పెద్దమ్మ ఆలయం వద్ద పెరిక కుల మండల నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో తిప్పని శ్రీనివాస్,అత్తె సారయ్య,బైరిశెట్టి రామారావు,బైరిశెట్టి వెంకటేశ్వర్లు,చిట్టి నర్సయ్య, కొమ్మ ప్రసాద్,వీర నరసింహారావు,కటకం లెలీన్, యగ్గడి శ్రీను,యగ్గడి జగదీష్,బిర్ర విష్ణు,పూజారి రమేష్,బైరిశెట్టి హేమంత్,కటకం నరసింహారావు, ముద్దం నాగేశ్వరరావు,సాంబయ్య,చిట్టి సతీష్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: