మన్యం టీవీ, కడెం:
గిరిజన సంక్షేమ ఆధీనంలో పని చేస్తున్న బాలికల ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించుటకు గాను గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ (పాఠశాల సహాయకురాలు / సీనియర్ ఎస్.జి. టి గా మహిళ ఉపాద్యాయులు జి.సి.డి.ఓ పోస్టుకు ఈ నెల 6 వ తేది సాయంత్రం 5 గంటల లోపు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం నిర్మల్ నందు దరకాస్తూ చేసుకోగలరని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీ యన్. శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న పాఠశాల సహాయకురాలు / సీనియర్ ఎస్.జి.టి మహిళ ఉపాధ్యాయులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మరియు నిర్మల్ జిల్లా వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని ప్రకటన లో తెలిపారు .
దరఖాస్తు తో పాటు విద్యార్హత మరియు అనుభవ ధ్రువీకరణ పత్రాలు జత చేయవలసినది గా కోరారు.
Post A Comment: