మన్యంటీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండలం చేల్పక గ్రామంలో బీజేపీ పార్టీ బూత్ కమిటీ సమావేశం మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ హాజరై కార్యకర్తలు ను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం చేల్పక గ్రామంలోని కాంగ్రెస్, టిఆర్ఎస్ చెందిన 50మంది కార్యకర్తలు యూత్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరిన వారికి బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ గారు పార్టీ కండువాలు కప్పి బీజేపీ పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు కావిరి అర్జున్, మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు మహ్మద్ యాకుబ్ పాషా, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, గిరిజన మోర్చ జిల్లా కార్యదర్శి చెరుకుల గోపి, మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు, సోదారి సమ్మయ్య, సంపత్, సమ్మయ్య, శ్రీను మరియు బూతు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: