CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జమడ లో జంగో లింగో పూజ

Share it:

 


ఉట్నూర్ మన్యం టీవీ ప్రతినిధి


ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని  జమడలో జంగో లింగో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెడమ జైవంత్ మహరాజ్ మాట్లాడుతూ గోండి ధర్మం నేటికీ పాట రూపంలో ఉంది ఎక్కడ లిఖిత పూర్వకంగా లేకపోయినా ఈ ధర్మం కొనసాగుతూ వస్తుంది అని అన్నారు. జంగుబాయి ఆగిన్ ధూడ్ రాయథడ్ అంటే నేటికి జంగుబాయికి ఒక రూపము అంటూ లేదు దీపము రూపంలో కొలుస్తారు  కోట పరొందొలి నేటికి విగ్రహం లేదు అని అన్నారు. దీక్షధారులు ఈ పుష్యమాసంలోనే నియమ నిష్ఠలతో కాకుండా ఎల్లప్పుడూ కూడా ఇదే ఆచారాన్ని పాటించాలి అని పేర్కొన్నారు. నేటికి గోండు మహిళలు పాట పాడుతున్నారు ఆ పాటలో సృష్టి ఎలా తయారు అయింది అనేది అందులో ఉంది అని తెలిపారు. శంభుగిరిజకు ముందు నిరంకార్ గురు తపెచారిగురు ఎలా అనేక మంది గురువుల జననం అయింది. ఈ కార్యక్రమంలో కోరేంగా సీతారాం కోయ పున్నెం జిల్లా అధ్యక్షులు, అనక దేవేందర్ ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ సాంస్కృతిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు,పుర్క బాపురావు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి,మంగం విషంరావు గోండి సాహిత్య. వేదిక కన్వీనర్, బాలన్పూర్ సర్పంచ్, వివిధ గ్రామాల దీక్షధారులు మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: